దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ

దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ

ఆయన ప్లేస్ లో భారతి హోళికేరికి బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డిని సంగారెడ్డి కలెక్టర్ గా ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. దుబ్బాక ఉపఎన్నికల్లో వెంకట్రామ్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పలు పార్టీల నేతలు ఆరోపించారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ గా భారతి హోళికేరిని ప్రభుత్వం నియమించింది. మెదక్ కలెక్టర్ గా హనుమంతరావును బదిలీ చేశారు. ఇక మంచిర్యాల కలెక్టర్ గా అదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు, పెద్దపల్లి కలెక్టర్ గా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

For More News..

స్ట్రీట్ లైట్ల నిర్వహణ పంచాయతీలకే వదిలేయాలి

టీఆర్‌‌ఎస్ కార్యకర్తలకే 10 వేలు ఇస్తున్నరు

కొన్ని దేశాల ఆర్మీలు పవర్ ఫుల్ అన్నది భ్రమే!