త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లోకి మరోసారి 'నువ్వే... నువ్వే'

త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లోకి మరోసారి 'నువ్వే... నువ్వే'

మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన ఎమోషనల్ అండ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీ నువ్వే నువ్వే మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నామని చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఇంకో చెప్పుకోదదగిన విషయం ఏమిటంటే ఈ చిత్రం రిలీజై అక్టోబర్ 10వ తేదీ నాటికి సరిగ్గా 20ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 నుంచి 7వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుందని మూవీ యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఈ మధ్యే 20ఏళ్ల కిందటి విజయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మేకర్స్ ఓ స్పెషల్ ఈవెంట్ ను కూడా అరెంజ్ చేశారు. అంతేకాదు ఏఎంబీ సినిమాలో స్పెషల్ షో ఏర్పాటు చేశారు.

లవర్ బాయ్ తరుణ్, శ్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం గత 20ఏళ్ల క్రితం అద్భుత విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్ నుంచీ కామెడీతో, పంచ్ లతో అలరించినా.. లాస్ట్ 15నిమిషాల హార్ట్ టచింగ్ ఎండింగ్ ను మాత్రం ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. అంతటి మ్యాజిక్ అండ్ మెస్మరైజింగ్ ఫిల్మ్ గా నిలిచిన ఈ మూవీ మరోసారి రిలీజ్ కానుండడంతో అభిమానులు మరోసారి ఆ ఫీల్ ను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.