సిద్ధూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు

సిద్ధూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు

చండీగఢ్: పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూపై మరో వివాదం నెలకొంది. సిద్ధూ తమ తల్లిని సరిగ్గా పట్టించుకోలేదని ఆయన సోదరి, ఎన్ఆర్ఐ సుమన్ తూర్ ఆరోపించారు. సిద్ధూ క్రూరమైన వ్యక్తి అని.. 1986లో తండ్రి చనిపోయిన వెంటనే తల్లిని ఇంట్లో నుంచి గెంటివేశాడని పేర్కొన్నారు. దీంతో ఆమె 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిస్సహాయ స్థితిలో మృతి చెందిందని సుమన్ చెప్పుకొచ్చారు. చండీగఢ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. సిద్ధూపై ఆరోపణలను రుజువు చేసేందుకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 

'ఆస్తి కోసం అమ్మతో, నాతో సంబంధాలను సిద్ధూ తెంచుకున్నాడు. నేనెప్పుడూ ఆయన నుంచి డబ్బులను కోరుకోలేదు. ఆస్తిని దక్కించుకునేందుకు నన్ను, అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు. మమ్మల్ని ఆయన పట్టించుకోవడం లేదు' అని సుమన్ తూర్ చెప్పారు. తనకు రెండేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ గతంలో అన్నారని.. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ ఆరోపణలపై సిద్ధూ ఇంకా స్పందించలేదు. 

మరిన్ని వార్తల కోసం:

తల్లినే చూసుకోని సిద్దూ ప్రజలను పట్టించుకుంటాడా?

మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య