మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు వసంత్ నగర్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యడ్యూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె అయిన సౌందర్య ఎంఎస్ రామయ్య హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం డాక్టర్ నీరజ్ తో ఆమెకు వివాహం కాగా ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో పనిమనిషి కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తెరవకపోవడంతో డాక్టర్ నీరజ్ కు ఫోన్ చేసింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఆయన తలుపులు తెరిచి చూడగా బెడ్ రూంలో సౌందర్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం  బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్ కు తరలించారు. సౌందర్య పోస్ట్ డెలివరీ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు సమాచారం.

For more news..

అమెరికా - కెనడా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం

పంజాబ్ బార్డర్‎లో పాక్ స్మగ్లర్లు