పంజాబ్ బార్డర్‎లో పాక్ స్మగ్లర్లు

పంజాబ్ బార్డర్‎లో పాక్ స్మగ్లర్లు

భారత్‎లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్మగ్లర్లపై కాల్పులు జరిపి తరిమికొట్టారు. 47 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ గురుదాస్ పూర్‎లోని చందూ వదాలా పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున సరిహద్దు దగ్గర స్మగ్లర్ల కదలికలు గమనించిన జవాన్లు.. వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. స్మగ్లర్లు చేసిన ఎదురుకాల్పుల్లో భారత జవాన్‎కు గాయమైంది. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్‎తోపాటు.. 7 కేజీల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా.. ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.