ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని స్కూల్ కు తాళంపెట్టిన టీఆర్ఎస్ లీడర్

ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని స్కూల్ కు తాళంపెట్టిన టీఆర్ఎస్ లీడర్

అదనపు తరగతి గదుల బిల్లులు చెల్లించలేదని స్కూల్​కు తాళం వేసిన టీఆర్​ఎస్​ లీడర్​

నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్​లోని ప్రైమరీ స్కూల్​లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్​గురువారం స్కూల్​కు తాళం వేశాడు. 2018-–19 సంవత్సరంలో ప్రైమరీ స్కూల్​లో నాలుగు అదనపు తరగతి గదులు, హైస్కూల్​లో గర్ల్స్, బాయ్స్ కు లాట్రిన్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. దీంతో నెక్కొండ టౌన్ కు చెందిన వార్డుమెంబర్, టీఆర్ఎస్​పార్టీకి చెందిన తోట సాంబయ్య ఆ పనులు పూర్తి చేశాడు. ఇందులో కేవలం రూ.5 లక్షలు రిలీజ్ చేసి మిగతా బిల్లులు పెండింగ్​పెట్టారు. అప్పులు ఇచ్చినవారు ఇంటి చుట్టూ తిరుగుతుండడం, రోజురోజుకు వడ్డీలు పెరుగుతుండడంతో సాంబయ్య స్కూల్​కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశాడు. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకంతో జీపీ ఎన్నికలపుడు 39 జీపీలలో వృద్ధులు ఓటు వేయడం కోసం ర్యాంపులు నిర్మించానని, నేటికీ బిల్లులు రాలేదన్నారు. ఇకనైనా పెండింగ్ బకాయిలు ఇప్పించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.