దుబ్బాక ప్రజలు మోసపోయినట్లు.. హుజురాబాద్ ప్రజలు మోసపోవద్దు

దుబ్బాక ప్రజలు మోసపోయినట్లు.. హుజురాబాద్ ప్రజలు మోసపోవద్దు

దుబ్బాక ప్రజలు మోసపోయినట్లు..హుజురాబాద్ ప్రజలు మోసపోవద్దన్నారు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి.దళితులకు రూ.10లక్షలు ఇస్తే ఈటలకు  కడుపు నొప్పెందుకన్నారు. ఈటల దళితులను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. ఈటల గడ్డిపోచనో..గడ్డపారనో పార్టీ మారినప్పుడే తెలిసిందన్నారు. ఈటల బావిలో పడ్డ గడ్డపార లాంటివాడన్నారు. హాస్టల్ తిండి తిన్న ఈటలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. లెప్టిస్ట్  అని చెప్పుకుంటున్న ఈటల బీజేపీలో ఎందుకు చేరారన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి బినామీ పేర్లతో ఈటల కొడుకు నితిన్ రెడ్డి నాణ్యత లేని చెక్ డ్యాంలు కట్టారన్నారు. దీని వల్ల రైతుల పొలాలు నీట మునిగిపోయాయన్నారు.ఈటల అవినీతి గురించి మాట్లాడితే నవ్వొస్తోందన్నారు.టీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసింది చూపించాలన్నారు. లేదంటే ఈటల డబ్బు పంపిణీ చేసింది చూపిస్తామన్నారు.