అర్థరాత్రి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళాలేసిన టీఆర్ఎస్ నేతలు

అర్థరాత్రి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళాలేసిన టీఆర్ఎస్ నేతలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొన్నింటికి టీఆర్ఎస్ నేతలు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా తాళాలు వేసుకున్నారు.  దీంతో పోచమ్మవాడకు చెందిన ప్రజలు తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారు. 96 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి పంపిణీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు… పెద్ద పల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మధ్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారే తాము ఎంపిక చేసిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని గ్రామస్తులు అంటున్నారు.

సిటీలో విడి పాలు కొనేందుకు జనాల ఇంట్రెస్ట్​