మీటింగ్ కి వస్తే 500 ఇస్తామని.. 150 మాత్రమే ఇచ్చారు

మీటింగ్ కి వస్తే 500 ఇస్తామని.. 150 మాత్రమే ఇచ్చారు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో సోమవారం టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమం జరిగింది. ఈ మీటింగ్ కు వస్తే డబ్బులు ఇస్తామని నాయకులు చెప్పారు. దాంతో జనం ఎక్కువ సంఖ్యలో వెళ్లారు. అక్కడ మీటింగ్ కు వచ్చిన వారికి 150 రూపాయలు ఇవ్వడంతో.. సభకు వచ్చిన వారు ఆగ్రహంతో అక్కడనుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. మీటింగ్ కు వస్తే తమకు 500 ఇస్తామని చెప్పి.. ఇక్కడకు వచ్చిన తర్వాత కేవలం 150 మాత్రమే ఇచ్చారని గ్రామస్తులు వాపోయారు.