సివిల్స్​ ర్యాంకర్​తో.. టీశాట్ ​మోటివేషనల్ ​క్లాస్

సివిల్స్​ ర్యాంకర్​తో.. టీశాట్ ​మోటివేషనల్ ​క్లాస్

హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపడానికీ టీ శాట్​ మోటివేషనల్​ క్లాసులను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా బుధవారం సివిల్స్​లో 938వ ర్యాంక్​ సాధించిన ఖమ్మంకు చెందిన రావూరి సాయి అలేఖ్యతో స్పెషల్​ లైవ్​ షోను నిర్వహించింది. తాను ఐదు సార్లు సివిల్స్​ సాధించలేకపోయినా ఎలా మోటివేట్​ చేసుకుంటూ విజయం సాధించానో ఆమె లైవ్​ షోలో వివరించారు.

కాగా, గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీఎస్సీ అభ్యర్థులకు టీశాట్​ నెట్​వర్క్​ ద్వారా లైవ్​లో క్లాసులు నిర్వహిస్తామని టీశాట్​ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి తెలిపారు. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్​ తదితర సబ్జెక్టులపై తొమ్మిది రోజుల పాటు క్లాసులను నిర్వహిస్తామని చెప్పారు. సబ్జెక్టులపై విద్య చానెల్​లో మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు రిపీట్​ ప్రోగ్రామ్​ ఉంటుందని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాలుంటే ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.