హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ శనివారం మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల12న పరీక్ష జరగాల్సి ఉండగా.. మార్చి 5కు పోస్ట్ పోన్ చేసింది. ఫిబ్రవరి12న గేట్ ఎగ్జామ్ఉండడంతో పలువురు అభ్యర్థులు ఏఈ ఎగ్జామ్ తేదీని మార్చాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
