గ్రూప్ 2 అప్లికేషన్లు 5,51,943

గ్రూప్ 2 అప్లికేషన్లు 5,51,943


హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 పోస్టులకు ఇప్పటివరకు 5,51,943 దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌‌‌‌పీఎస్సీ వెల్లడించింది. అయితే, పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. నిరుడు డిసెంబర్ 29న 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ ఏడాది జనవరి 18 నుంచి అప్లికేషన్ల ప్రక్రియను చేపట్టింది. కాగా, 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను మార్చి 20కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.