విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం వద్దు:యూటీఎఫ్

విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం వద్దు:యూటీఎఫ్
  • ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో లాభం లేదు: యూటీఎఫ్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ఎన్జీవోల పెత్తనం పెరిగిపోతోందని, క్వాలిటీ చదువుల పేరు చెప్పి పరోక్షంగా స్కూళ్లను ప్రైవేటు పరం చేసేందుకు బాటలు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి, జనరల్ సెక్రటరీ వెంకట్ ఆరోపించారు. 

సర్కారు బడులను కాపాడేందుకు, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28, 29 తేదీల్లో జనగామలో భారీ ఎత్తున ‘రాష్ట్ర విద్యా సదస్సు’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం హైదరాబాద్​లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో విద్యాసదస్సుకు సంబం ధించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు.