5 ఏళ్ల లోపు పిల్లలున్నవారికి టీటీడీ స్పెషల్ ఆఫర్

5 ఏళ్ల లోపు పిల్లలున్నవారికి టీటీడీ స్పెషల్ ఆఫర్

ఈ నెల 14 నుంచి శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మార్చి మొదటి వారంలో పంచాంగాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ నెల 11, 25 వ తేదీలలో వయోవృద్ధులు వికలాంగులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. 12, 26వ తేదీలలో 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లితండ్రులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే సేవా టిక్కెట్లు తీసుకోవాలన్నారు. టీటీడీ వైబ్ సైట్లలో టిక్కెట్లు లేకపోతే ఇతర సైట్లలో ఉన్న టిక్కెట్లను నకిలీవిగా గుర్తించాలన్నారు.  నకిలీ వైబ్‌సైట్లు నిర్వహిస్తున్న 19 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో మే నెలకు సంబందించి 72,773 ఆర్జిత సేవా టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు.

త్వరలో జమ్మూకశ్మీర్ తో పాటు వారణాసిలో టీటీడీ ఆలయం నిర్మిస్తామన్నారు.  జమ్ములో ఇప్పటికే రెండు చోట్ల స్థలాలను అక్కడి ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈవోతో పాటు టీటీడీకి చెందిన ఇతర ఉన్నతాధికారుల బృందం జమ్మూకశ్మీర్‌కు వెళ్ళారని చెప్పారు.

see more news

వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టి పారిపోవడమే అతడి పని

జగిత్యాలలో దారుణం..8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం