
సంగారెడ్డి: దీపావళి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో పడి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్లో జరిగింది. పండుగ పూట ఆ కుటుంబం తమ ఇద్దరు చిన్నారులనూ కోల్పోయింది. రేజింతల్లో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో జారిపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడంలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.