
తెలంగాణ, ఛత్తీస్ గడ్ బార్డర్ వెంకటాపురం మండలంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నూగురు దగ్గర గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. బీజాపూర్ సరిహద్దులోని కర్రెలగుట్ట సమీపంలో సాయుధ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. చనిపోయిన వారిలో ఒకర్ని ఏటూరు నాగారం, మహదేవ్ పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్ గా గుర్తించారు. కాల్పుల్లో ఒక జవాన్ కు గాయాలయ్యాయి. అతడ్ని హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.
మరిన్ని వార్తల కోసం: