జల్సాగా బతుకుదామని.. స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన్రు

జల్సాగా బతుకుదామని.. స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన్రు

సికింద్రాబాద్: పక్కా ప్లాన్ తో స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి నాలుగు లక్షల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇన్స్ పెక్టర్ మధుకర్ స్వామి మాట్లాడుతూ..  కార్ఖానా బస్తీలో నివాసముంటున్న ఇస్మాయిల్ కొన్ని రోజుల క్రితం తన ఫ్లాట్ ను అమ్మాడు. ఆ వచ్చిన సొమ్మును ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇస్మాయిల్ స్నేహితులైన  ఆయుబ్, అఫ్రోజ్ లు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా డబ్బులు దొంగిలించాలనుకున్నారు.

పథకం ప్రకారం గత నెల 12వ తేదీన ఇస్మాయిల్ ఇంట్లో ఎవరు లేరని గమనించి..కిటికీ గ్రిల్స్ తొలగించి, ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న డబ్బును అపహరించారు. తమ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు విలాసవంతమైన జీవనం గడపడానికి ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు పోలీసులకు విచారణలో తెలిపారు..ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

two-people-arrested-by-karkhana-police-for-stealing-in-their-friends-house