ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... 17 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం రాత్రి ఈ ఘటన చోటచేసుకుంది. భవనం ఒక్కసారిగా పడిపోవడంతో శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎస్ డీఆర్ఎఫ్, ఎన్ డీఆర్ఎఫ్ టీం ప్రమాదస్థలాన్ని చేరుకొని సహాయచర్యలు చేపట్టాయి.
శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కార్మికుల డెడ్ బాడీలు బయటకు తీశారు. గాయపడ్డ 17 మందిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించామని, వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు తెలిపారు.