
దేశం నివ్వెరపోయే సంచలన వార్త ఇది.. అవును.. ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం.. 2025, జూలై 15వ తేదీ నుంచి టూ వీలర్స్.. అంటే బైక్స్కు ఫాస్టాగ్ ఉండాల్సిందే.. బైక్స్కు టోల్ ఛార్జీలు పడనున్నాయి.. టోల్ గేట్ల దగ్గర బైక్స్ డబ్బులు కట్టాల్సిందే.. ఇండియా టుడే కూడా ఒక కథనం రాయడంతో ఈ వార్తపై చర్చ జరుగుతోంది.
🚨 Two-wheelers in India will no longer enjoy the privilege of a toll-free experience at highway entry points from July 15, 2025. pic.twitter.com/HRQisu3yVg
— Indian Tech & Infra (@IndianTechGuide) June 26, 2025
కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు.. నేషనల్ హైవే అథారిటీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.. అయినా డిజిటల్ మీడియాలో బైక్స్, టూ వీలర్స్ కు కూడా టోల్ ఛార్జీలు.. జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనే వార్త చక్కర్లు కొడుతుంది.
ఇన్నాళ్లూ ఒక్క పైసా చెల్లించుకుండా నేషనల్ హైవేలపై ఒక పక్క నుంచి రయ్మని వెళుతుండే ద్విచక్ర వాహనదారులు జులై 15 నుంచి టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తక్కువ దూరానికి 10 రూపాయలు, మీడియం డిస్టెన్స్కు 20 రూపాయలు, లాంగ్ డిస్టెన్స్కు 30 రూపాయలు, యావరేజ్ డైలీ కాస్ట్ 15 రూపాయలు అని ధరలతో సహా కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు కనిపించడంతో ద్విచక్ర వాహనదారుల్లో కలకలం రేగింది. అయితే.. జులై 15 నుంచి ద్విచక్ర వాహనాలకూ టోల్ కట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే అధికారికంగా నిర్ధారించలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన గానీ, మార్గదర్శకాలు గానీ విడుదల చేయలేదు.
ఒకవేళ బైకులకు టోల్ ఫీజు కట్టాల్సి వస్తే జులై 15, 2025 నుంచి ఏం మార్పులకు అవకాశం ఉంది ?
* నేషనల్ హైవేలపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
* ఫాస్టాగ్ ను బ్యాంక్ అకౌంట్ కు గానీ డిజిటల్ వ్యాలెట్ కు గానీ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
* ద్విచక్ర వాహనానికి ఫాస్టాగ్ ఫిక్స్ చేసుకుని టోల్ పేమెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది.
* కమర్షియల్ వెహికల్స్కు, ఫోర్ వీలర్స్కు ఇప్పటికే టోల్ వసూలు విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.