చార్మినార్ దగ్గర బయటపట్ట అండర్ గ్రౌండ్ మెట్లు

చార్మినార్ దగ్గర బయటపట్ట అండర్ గ్రౌండ్ మెట్లు

చార్మినార్ వద్ద పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వెంటనే తవ్వకాలను నిలిపివేశారు. చార్మినార్ ఆవరణలో జనరేటర్ ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు చేపట్టగా మెట్లు బయటపడ్డాయి. సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చార్మినార్ వద్దకు చేరుకున్న పురావస్తు శాఖ అధికారులు బయటపడ్డ మెట్లను పరిశీలించారు. 

అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడ్డాయంటూ ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున జనం చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఎంఐఎం నేతలు సైతం అక్కడకు చేరుకుని తవ్వకాలు జరపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తవ్వకాలకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ప్రభుత్వం భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోంది

బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు