ప్రభుత్వం భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోంది

ప్రభుత్వం భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోంది

రైతులకు న్యాయం చేయాలి: టీజేఎస్ చీఫ్ కోదండరాం

హైదరాబాద్: పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు  టీజేఎస్ చీఫ్ ప్రొ.కోదండరాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సర్వేనంబర్ 540లో గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొందరు నేతలు అక్రమంగా పట్టా చేసుకున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ అండదండలతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెబుతున్న కేసీఆర్ వీటికి ఏం సమాధానం చెబుతారోనని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

బైక్ను ఢీకొన్న ట్రైన్.. తృటిలో తప్పించుకున్న యువకుడు