గుడిలోకి షార్ట్స్, నైట్ డ్రస్సులతో రావొద్దు : మధుర ఆలయం

గుడిలోకి షార్ట్స్, నైట్ డ్రస్సులతో రావొద్దు : మధుర ఆలయం

మన దేశంలో క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను రక్షించేందుకు  బుదౌన్ జిల్లాలోని బిరువా బడి ఆలయంలోకి పొట్టి బట్టలు, చిరిగిన ప్యాంట్ లను ధరించి వచ్చే భక్తులను నిషేధించారు.  కొంతమంది ప్రజలు మన సాంప్రదాయాలను మర్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారి రాస్మిహారి గోస్వామి తెలిపారు. ముఖ్యంగా చెప్పాలంటే  మధుర దేవాలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు కచ్చితంగా ధరించాలని వెల్లడించారు. 

బర్సానాలోని రాధారాణి ఆలయం హాఫ్ ప్యాంట్, బెర్ముడా షార్ట్‌లు, మినీ స్కర్టులతో  మాత దర్శనానికి రాకూడదని ఆలయాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ఉత్తర్వులను జూన్ 21న దేవాలయ ప్రాంగణంలో  ఒక పెద్ద పోస్టర్ రూపంలో తెలియజేశారు. ప్రస్తుత కాలంలో సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని ఆలయ అధికారి  పేర్కొన్నారు.

పూర్వం రోజులలో మన పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించేవారు.కానీ ఇప్పటి యువత, యువజన మహిళలు పొట్టి దుస్తుల్లో దేవాలయాలను సందర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది మంచిది కాదని కూడా వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి మన మత విలువలను దెబ్బతీస్తాయని  వెల్లడించారు. ఇతర మతాలను ఆచరించే వ్యక్తులు తమ ప్రధాన మత విశ్వాసాల నుంచి ఎప్పటికీ వైదొలగరని అన్నారు.అయితే దుస్తుల పై నిషేధం దశాబ్దాల పురాతన దేవాలయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని  చెబుతున్నారు.

ALSOREAD:భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలె : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి