ఫ్రంట్ సీట్ కోసం గొడవపడ్డ కానిస్టేబుళ్లు

ఫ్రంట్ సీట్ కోసం గొడవపడ్డ కానిస్టేబుళ్లు

కారు ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్నవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బిత్తూర్ పీఎస్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు డయల్ 100 పెట్రోలింగ్ వాహనంలోని ముందు సీటు కోసం గొడవ పడ్డారు. వారిద్దరూ గొడవపడుతుండగా మరో కానిస్టేబుల్ వారిని ఆపేందుకు ప్రయత్నిస్తుట్లున్న ఈ వీడియోను తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో కాస్త డిపార్ట్ మెంట్ వరకూ వెళ్లడంతో అధికారులు ఇదేం గొడవ అంటూ మండిపడుతున్నారు. కానిస్టేబుళ్లు అయుండి.. ఇలా సీట్ కోసం కొట్లాడుకుంటారా అంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఈ నెల 18 న ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. కానిస్టేబుళ్లను రాజేష్ సింగ్, సునీల్ కుమార్ గా  గుర్తించారు.