యూపీలో బీజేపీ గెలుపునకు బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎంఐఎం అధినేత ఒవైసీ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు శివసేన నేత సంజయ్ రౌత్. వారికి పద్మ విభూషణ్, భారతరత్న ఇవ్వాలన్నారు. సమాజ్ వాదీ పార్టీకి యూపీలో గత ఎన్నికలకంటే ఈసారి మూడు రెట్లు అధికంగా సీట్లు పెరిగాయన్నారు. అఖిలేష్ 42 నుంచి 125 సీట్లు కైవసం చేసుకున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిచామని గొప్పలు చెప్పుకునే బీజేపీ పంజాబ్ లో ఎందుకు ఓడిపోయిందో సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ లో సీఎం,గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.
BJP achieved a great victory. UP was their state, still, Akhilesh Yadav's seats have increased 3 times, from 42 to over 125. Mayawati & Owaisi have contributed to BJP's win, so they must be given Padma Vibhushan, Bharat Ratna: Shiv Sena leader Sanjay Raut#ElectionResults2022 pic.twitter.com/1p8LLiluG7
— ANI (@ANI) March 11, 2022
మరిన్ని వార్తల కోసం