న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. ఇంటర్నేషనల్ బాడీకి హామీ ఇచ్చింది. వీలైనంత మేరకు ఒలింపిక్స్కు వెళ్లే ఇండియా టీమ్లో ప్రతి ఒక్కరికి రెండు డోస్ల వ్యాక్సిన్ పూర్తి చేస్తామని చెప్పింది. టోక్యో
బయలుదేరడానికి ముందే ఈ వ్యవహారాన్ని కంప్లీట్ చేయనున్నారు. ‘గేమ్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరి సేఫ్టీ మాకు చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్ను మేం పాటిస్తాం. ఐవోసీ ఇచ్చిన గైడ్లైన్స్ను పాటిస్తాం. అథ్లెట్స్, టెక్నికల్ అఫీషియల్స్, డెలిగేట్ మెంబర్స్కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. జపాన్ బయలుదేరడానికి ముందే వీళ్లకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తాం. వీళ్లలో చాలా మందికి ఫస్ట్ డోస్ కంప్లీట్ అయ్యింది.
ప్రొటోకాల్స్ ప్రకారం సెకండ్ డోస్ను కూడా అందిస్తాం’ అని ఐవోఏ పేర్కొంది.