హైదరాబాద్ : రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరముందని తెలిపారు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. ఇవాళ హైదరాబాద్ లోని ఇఫ్లూలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో ఆయన ప్రసంగించారు. వజ్రోత్సవాల పైలాన్ ను ఆవిష్కరించారు. దేశానికి సుస్థిర అభివృద్ది అవసరమని, మహిళా సాధికారత, నిరుద్యోగం, విద్యపై లోతుగా చర్చించాల్సిన అవసరముందన్నారు.
వృద్ధి రేటు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. జనం ఆరోగ్యంగా ఉంటేనే, దేశం సుసంప్నంగా ఉంటుందని.. ఎవరి విధులు వారు సమర్థంగా నిర్వర్తించడమే అసలైన దేశభక్తి అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Vice-President M Venkaiah Naidu addressing the gathering after inaugurating the international conference for Development Discourse #ICCD2019 in Hyderabad today pic.twitter.com/u2ZyEDtcJg
— AIR News Hyderabad (@airnews_hyd) February 9, 2019