అప్పుడు లేచిన నోరు ఇప్పుడెందుకు లేవట్లే…

అప్పుడు లేచిన నోరు ఇప్పుడెందుకు లేవట్లే…

పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే లేచిన నోరు కోటానుకోట్ల భక్తుల విశ్వాసాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు  వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. రాముడి పేరు పెట్టుకున్నందుకైనా కేటీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలన్నారు. కేటీఆర్ రెచ్చగొట్టే ప్రకటన చూస్తుంటే రామ మందిరంపై ఎమ్మెల్యేల మాటలు టీఆర్ఎస్ విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.  హిందువుల విశ్వాసాలు గాయ పరచడంలో టీఆర్ఎస్ ఎంఐఎంతో  పోటీ పడుతుందన్నారు. రామ కార్యానికి అడ్డుపడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యకలాపాలపై ఇకపై ఎవరైనా అనవసరంగా నోరు జారితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.