గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీ రావాలి : డీకే అరుణ

గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీ రావాలి : డీకే అరుణ

కొడంగల్,వెలుగు:  గల్లీలో ఎవరున్నా...ఢిల్లీ లో మోదీ రావాలని, ఆయనతోనే ప్రపంచంలోనే భారత్​ నంబర్ వన్​గా ఎదిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. గురువారం కొడంగల్​లో విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్  చౌరస్తాలో రోడ్​ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ..  రైలు, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులు, సామాన్యులకు ఇండ్లు, ఆస్పత్రులు కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. 

వికారాబాద్​, కృష్ణ రైల్వే లైన్​కు సర్వే పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామననారు.   రాష్ట్రంలో 10 నుంచి12 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు ఓటేస్తే... ఏట్లో వెసినట్లే అని విమర్శించారు.  కేంద్రంలో రాహుల్​ ప్రధాని కావడం ఎప్పటికీ జరగదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్​అవినీతి, అరాచక, కుటుంబపాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని ఆమె పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డి, శాంతకుమార్​ పాల్గొన్నారు.