బిహార్ లోని కాటిహార్ జిల్లాలో పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అమ్డోల్ గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ ను కల్తీ మద్యం కేసులో ఈ నెల 16న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో ప్రమోద్ సింగ్ జైల్లో చనిపోయాడు.
దీంతో గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్ ఆవరణలోని వాహనాలు ధ్వంసం చేశారు. స్టేషన్ లోకి చొరబడి పోలీసులపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిని కాటిహార్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
Bihar | Several police personnel were injured yesterday after a group of villagers attacked Pranpur police station in Katihar following a death of a man allegedly in custody pic.twitter.com/9WD3ZUkBph
— ANI (@ANI) September 18, 2022