మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన స్థానికులు

మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన స్థానికులు

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లిన  మల్లారెడ్డిని మేడ్చల్ జిల్లా కాచవానిసింగారం గ్రామస్తులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాత గ్రామపంచాయతీ స్థలంలో బీసీ భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు

 అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంఢ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రికి సమస్యలు వివరిస్తున్న గ్రామస్తులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు పోలీసుల మధ్య వ్వాగ్వాదం జరిగింది. స్థానికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేయడంతో మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.