ఐపీఎల్ లో ఫెవరెట్ జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నా సత్తాచాటలేకపోతుంది. టైటిల్ గెలవలేకపోతుంది. ఈ 13 సీజన్లోనైనా ఎలాగైనా టైటిల్ గెలిచేందుకు ఆర్సీబీ సిద్దమవుతుంది. సరికొత్త లోగోతో ముందుకొస్తుంది. ఇవాళ ఆర్సీబీ కొత్త లోగోను రిలీజ్ చేసింది జట్టు యాజమాన్యం. ఆర్సీబీ సరికొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుందని లోగో వీడియోను పోస్ట్ చేసింది. ఈ లోగోలో సింహాం తలపై కిరీటం ఉంది.
ఈ లోగోపై ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ కూడా స్పందించాడు. కొత్తలోగోను చూడటం థ్రిల్లింగ్ గా ఉందన్నాడు. . కొత్త లోగో ఆటగాళ్లకు స్పూర్తినిస్తుందన్నాడు. ఈ ఐపీఎల్ కోసం ఆగలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు.2016లో ఫైనల్ కు వెళ్లిన ఆర్సీబీ ఇంతవరకు ప్లే ఆఫ్ కు కూడా వెళ్ల లేకపోయింది. మరి లోగో మార్పుతోనైనా ఈ సారైనా ఆర్సీబీ దశ మారుతుందా? అనేది చూడాలి.
LOGO ka kaam hai kehna. ? Thrilled to see our new @rcbtweets logo. It embodies the Bold pride and challenger spirit that our players bring to the field. Can’t wait for #IPL2020 #NewDecadeNewRCB ? https://t.co/n8c24JqbAl
— Virat Kohli (@imVkohli) February 14, 2020