ఆర్సీబీ లోగో మారింది.. మరి దశ మారుతుందా.?

ఆర్సీబీ లోగో మారింది.. మరి దశ మారుతుందా.?

ఐపీఎల్ లో ఫెవరెట్ జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నా సత్తాచాటలేకపోతుంది. టైటిల్ గెలవలేకపోతుంది.   ఈ 13 సీజన్లోనైనా ఎలాగైనా టైటిల్ గెలిచేందుకు ఆర్సీబీ సిద్దమవుతుంది. సరికొత్త లోగోతో ముందుకొస్తుంది. ఇవాళ ఆర్సీబీ కొత్త లోగోను రిలీజ్ చేసింది జట్టు యాజమాన్యం.  ఆర్సీబీ సరికొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుందని లోగో వీడియోను పోస్ట్ చేసింది. ఈ లోగోలో సింహాం తలపై కిరీటం ఉంది.

ఈ లోగోపై ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ కూడా స్పందించాడు. కొత్తలోగోను చూడటం థ్రిల్లింగ్ గా ఉందన్నాడు. . కొత్త లోగో ఆటగాళ్లకు స్పూర్తినిస్తుందన్నాడు. ఈ ఐపీఎల్ కోసం ఆగలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు.2016లో ఫైనల్ కు వెళ్లిన ఆర్సీబీ ఇంతవరకు ప్లే ఆఫ్ కు కూడా వెళ్ల లేకపోయింది. మరి లోగో మార్పుతోనైనా ఈ సారైనా ఆర్సీబీ దశ మారుతుందా? అనేది చూడాలి.