- రూ. కోటి ప్రైజ్ మనీ విరాళంగా ప్రకటించిన వివేకానంద కేంద్ర
న్యూఢిల్లీ: తనకు లభించిన మహాత్మా గాంధీ శాంతి బహుమతిని పుల్వామా అమర జవాన్లకు అంకితం చేస్తున్నట్లు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర ప్రకటించింది. శాంతి బహుమతి కింద వచ్చిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను వాళ్ల కుటుంబాల సంక్షేమానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. వివేకానంద కేంద్ర 2015 సంవత్సరానికి గాను గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైనారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంస్థ ప్రతినిధి పి.పరమేశ్వరన్ పురస్కారం అందుకున్నారు.