ఇండియా గవర్నమెంట్‌‌తో ట్యాక్స్ కేసులో వొడాఫోన్ గెలుపు

ఇండియా గవర్నమెంట్‌‌తో ట్యాక్స్ కేసులో వొడాఫోన్ గెలుపు

న్యూఢిల్లీ: ఇండియన్ గవర్నమెంట్‌‌తో రూ.20 వేల కోట్ల ట్యాక్స్ కేసులో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ గ్రూప్ విజయం సాధించింది. ఎయిర్‌‌వేస్, లైసెన్సింగ్ ఫీజు కింద పునరావృత్త పన్ను చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వొడాఫోన్ వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2016లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌‌ను వొడాఫోన్ ఆశ్రయించింది. దీనిపై ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెల్లడించింది.