ఓయూ, వెలుగు: ఓయూ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా సోమవారం క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఆర్ట్స్కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్వరకు ఉదయం 2కే వాక్నిర్వహించారు. ఓయూ టెక్నాలజీ కాలేజీ ఆధ్వర్యంలో ‘టెక్నో ఉస్మానియా’ పేరుతో 3 కే రన్, ఫ్లాష్మాబ్ నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో స్టూడెంట్లు, లెక్చరర్లు పాల్గొని సందడి చేశారు. 2కే వాక్ను ఓయూ వీసీ ప్రొఫెసర్రవీందర్యాదవ్ఆర్ట్స్కాలేజీ వద్ద జెండా ఊపి ప్రారంభించగా, గ్రీన్ లివింగ్ఈజ్ స్మార్ట్ లివింగ్ అనే నినాదంతో ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ పూర్వ విద్యార్థి సంఘం కోశాధికారి, రిటైర్డ్ సైంటిస్ట్ సీపీ రాములు 3కే రన్ను ప్రారంభించారు. ఓయూ లేడీస్ హాస్టల్సమీపంలోని ఎల్లమ్మ టెంపుల్వద్ద ఫ్లాష్మాబ్ తో అదరగొట్టారు. డీజే సాంగ్స్కు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్లక్ష్మీనారాయణ, డీన్ప్రొఫెసర్మల్లేశం, టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ప్రొఫెసర్చింతా సాయిలు, లెక్చరర్లు రమేశ్, బసవరావు, హయ వదన, శ్రీను నాయక్, పరశురామ్తదితరులు పాల్గొన్నారు.

