కోర్టు ఎదుట హాజరవ్వండి

 కోర్టు ఎదుట హాజరవ్వండి

బెంగాల్ సీఎం మమతకు ముంబై మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 2న కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. జాతీయ గీతాన్ని మమత అవమానించారనే ఫిర్యాదు మేరకు మార్చి2న కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది.  ముంబై బీజేపీకి చెందిన వివేకానంద గుప్తా అనే వ్యక్తి  మమతపై ఫిర్యాదు చేశారు. 2021 డిసెంబర్‌లో ఆమె నగరానికి వచ్చిన సందర్భంగా జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఆరోపిస్తూ, TMC అధినేత్రిపై కేసు పెట్టారు.  2015 నాటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయగీతం విషయంలో ఇచ్చిన ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని ఆరోపించారు. జాతీయ గీతం పాడినప్పుడు.. లేదా ప్రసారం చేసినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా నిలబడాలని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.