
హైదరాబాద్, వెలుగు: సర్కారీ స్కూల్స్ స్టూడెంట్స్కు 3 రోజుల కిందే డిజిటల్ పాఠాలు స్టార్ట్ చేసిన విద్యా శాఖ అధికారులు..వాళ్లకు టెస్టులు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. వారానికొసారి వీక్లీ టెస్టులతో పాటు మంత్లీ టెస్ట్ లను కూడా పెట్టాలనుకుంటున్నారు. దీని ద్వారా డిజిటల్ పాఠాలు పిల్లల కు ఎంత వరకు అర్థమవుతున్నాయి, ఏం నేర్చుకుంటారన్నది అంచనా వేయవచ్చని భావిస్తున్నారు.పరీక్ష లు ఎలా పెట్టాలో ఆలోచనలు చేస్తున్నారు. స్టూడెంట్లకు క్వశ్చన్ పేపర్ ఎలా అందివ్వాలి..? వాటిని మళ్లీ ఎలా సేకరిచాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నా రు. ఎగ్జామ్స్ ఉన్నాయంటేనే పిల్లలు రెగ్యులర్ గా డిజిటల్ క్లాస్ లు వింటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.