శభాష్ ​రాందాస్​!

శభాష్ ​రాందాస్​!
  •  వృద్ధురాలిని వీపుపై మోస్తూ సలేశ్వరం కొండెక్కిన కానిస్టేబుల్​

నల్లమలలో సలేశ్వరం జాతరకు వచ్చిన ఓ వృద్ధురాలు కొండ ఎక్కేందుకు ఇబ్బంది పడుతుండడంతో ఓ కానిస్టేబుల్​ఆమెను వీపుపై ఎక్కించుకుని పైకి తీసుకువెళ్లాడు. నాగర్ కర్నూల్ కు చెందిన 75 ఏండ్ల రాములమ్మ సలేశ్వరంలోని లింగమయ్య దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కొండ ఎక్కేందుకు ఇబ్బంది పడింది. 

ఆమె కష్టాన్ని చూసిన అచ్చంపేట కానిస్టేబుల్ రాందాస్​ తన వీపుపై ఎక్కించుకుని కొండపైకి తీసుకువచ్చాడు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ ​అయ్యింది. విషయం తెలుసుకున్న సీఐ రవికుమార్​, పలువురు భక్తులు రాందాస్​ను అభినందించారు.