వెస్టిండీస్‌‌దే టీ20 సిరీస్‌‌‌‌

వెస్టిండీస్‌‌దే టీ20 సిరీస్‌‌‌‌

వెస్టిండీస్‌‌దే టీ20 సిరీస్‌‌‌‌

తరౌబా (ట్రినిడాడ్‌‌‌‌) : షై హోప్ (43 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 43 నాటౌట్‌‌‌‌) పోరాటంతో ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన ఐదో టీ20లో వెస్టిండీస్  4 వికెట్ల తేడాతో వరల్డ్ చాంపియన్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌ను 3–2తో సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ  పోరులో తొలుత ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (38), లివింగ్‌‌‌‌ స్టోన్‌‌‌‌ (28), మొయిన్ అలీ (23) రాణించారు. కరీబియన్‌‌‌‌ బౌలర్లలో గుడాకేశ్‌‌‌‌ మోతీ మూడు, ఆండ్రీ రసెల్, అకీల్ హొస్సేన్, జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 133/6 స్కోరు చేసి గెలిచింది. హోప్‌‌‌‌తో పాటు రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ (30) రాణించాడు. మోతీకి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌, ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌ అవార్డులు లభించాయి.