సిరీస్‌‌ విండీస్ సొంతం..మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి

సిరీస్‌‌ విండీస్ సొంతం..మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి

బ్రిడ్జ్‌‌టౌన్‌‌: అరంగేట్రం ఆటగాడు కేసీ కార్టీ (50), రొమారియో షెఫర్డ్ (41 నాటౌట్‌‌) మెరుపులతో శనివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌‌ 4 వికెట్ల తేడాతో (డక్‌‌వర్త్​ పద్ధతి)ఇంగ్లండ్‌‌ను ఓడించింది. దాంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 40 ఓవర్లలో 206/9 స్కోరు చేసింది.

బెన్‌‌ డకెట్ (71),  లివింగ్‌‌స్టోన్‌‌ (45) రాణించారు. కరీబియన్‌‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డె, అల్జారీ జోసెఫ్‌‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం విండీస్ టార్గెట్‌‌ను 34 ఓవర్లలో 188 రన్స్‌‌గా సవరించారు. ఛేజింగ్‌‌లో కరీబియన్‌‌ టీమ్ 31.4 ఓవర్లోనే 191/6 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్‌‌‌‌ అలిక్ అతానజే (45) కూడా రాణించాడు.