సికింద్రాబాద్, వెలుగు: స్పీడ్ గా వెళ్తూ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ కు చెందిన యశ్వంత్ యాదవ్(22), డిగ్రీ చదువుతుండగా, అతని ఫ్రెండ్ సాయిరాం (31) డ్రైవర్గా చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీరు స్పోర్ట్స్ బైక్పై బోడుప్పల్ నుంచి ఖైరతాబాద్గణపతిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
అడిక్ మెట్ ఫ్లై ఓవర్ మీద వేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పగా డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో బైక్నడుపుతున్న యశ్వంత్ స్పాట్లోనే చనిపోగా.. సాయిరామ్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వీరు మృతితో బోడుప్పల్ లో విషాదం అలుముకుంది. యశ్వంత్ యాదవ్ కాంగ్రెస్ నేత తోటకూర వజ్రేశ్ యాదవ్ బంధువు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.