మద్యం మత్తులో భర్తను కొట్టి చంపిన భార్య

మద్యం మత్తులో భర్తను కొట్టి చంపిన భార్య

పాతబస్తీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న వాడిని కడతేర్చింది ఓ భార్య. చాంద్రాయణగుట్టలో ఉండే రేష్మ, మొహమ్మద్ సోహైల్‌లు భార్యభర్తలు. వీరిద్దరూ సోమవారం ఓ చిన్న విషయంలో గొడవపడ్డారు. అది మనసులో పెట్టుకున్న రేష్మ.. మద్యం తాగి వచ్చి.. భర్తను పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపైనే బండరాళ్లతో కొట్టి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాస్టిక్ కాగితాలతో కాలబెట్టేందుకు ప్రయత్నం చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలు రేష్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గొడవకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.