బిహార్‌‌ ఎన్నికల్లో నితీశ్ నాయకత్వంలో పోరు

బిహార్‌‌ ఎన్నికల్లో నితీశ్ నాయకత్వంలో పోరు

జేపీ నడ్డా స్పష్టం

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా తలమునకలై ఉన్నారు. ఆ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి పొత్తులు, సీట్ల పంపకం మీద దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు పార్టీ రాష్ట్ర టాప్ లీడర్స్‌తో చర్చిస్తున్నారు. ఈ విషయం కొంత మేర కొలిక్కి వచ్చింది. దీనిపై తాజాగా నడ్డా కామెంట్ చేశారు. సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడబోతున్నామని నడ్డా స్పష్టం చేశారు.

బిహార్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్–నవంబర్‌‌లో జరగనున్నాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నడ్డా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, జేడీ(యూ), ఎల్‌జేపీ కూటమిపై తనకు నమ్మకం ఉందన్నారు. కలసికట్టుగా పోరాడి విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ లోకల్‌ ఫర్ వోకల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ముజఫర్‌‌పూర్ నుంచి లిచీని, మధుబనీ నుంచి తేనెను ముందుకు తీసుకెళ్తూ స్వావలంబన దిశగా దేశాన్ని ఉరకలెత్తించాలని చెప్పారు.