హర్యానాలో బీజేపీ హవా కొనసాగుతోంది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా.. ప్రతిపక్షాల అనైక్యత, సోషల్ఇంజనీరింగ్అధికార పార్టీకి కలిసొస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు నామమాత్రంగా ఉన్న పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 47 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నియామకాల్లో అవినీతిని అడ్డుకుని నిరుద్యోగుల అభిమానాన్ని, హెచ్చార్ఏ ఆపేసి ఉద్యోగుల నిరసననూ బీజేపీ మూటగట్టుకుంది. పంజాబీ నేత మనోహర్లాల్ఖట్టర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంపై జాట్వర్గాలు మండిపడుతున్నాయి. ఇలా భిన్న వర్గాల ప్రజలు ఖట్టర్సర్కారుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీని ఎదుర్కొనే ధీటైన ప్రతిపక్షంలేకపోవడం పార్టీకి కలిసొస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఇండియన్నేషనల్లోక్దళ్(ఐఎన్ఎల్డీ)లో కుటుంబ చిచ్చు, కాంగ్రెస్పార్టీకి ప్రజాదరణ తగ్గడం.. బీజేపీకి కలిసొస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఓబీసీలే కీలకం..
రాష్ట్రంలో పది లోక్సభ స్థానాలు ఉండగా.. ఫరీదాబాద్, కురుక్షేత్ర, గుర్గావ్ లలో ఓబీసీలదే నిర్ణయాత్మక పాత్ర. గుజ్జర్లు, సైనిస్, యాదవులతో పాటు సోనిపట్లో బ్రాహ్మణులు, కర్నాల్లో పంజాబీల ప్రభావం ఎక్కువ. అంబాలా, సిర్సా స్థానాలను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్చేసింది. తాజాగా కుటుంబ గొడవలతో ఐఎన్ఎల్డీ ముక్కలైంది. చౌతాలా మనవడు దుష్యంత్ స్థాపించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఐఎన్ఎల్డీ బలహీనంగా మారింది. ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే పరిస్థితే లేదని సమాచారం. అంతర్గత గొడవలతో కాంగ్రెస్సతమతమవుతోంది. లోక్తంత్ర సురక్ష పార్టీ(ఎల్ఎస్పీ)తో కలిసి బీఎస్పీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆప్, జేజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇలా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీజేపీ ఈసారి గట్టెక్కుతుందని రాజకీయ వర్గాల అంచనా.
ఎక్కడెక్కడ ఎవరెవరు..
ఫరీదాబాద్: కాంగ్రెస్పార్టీ తరఫున మాజీ ఎంపీ అవతార్సింగ్భాదన పోటీ చేస్తున్నారు. చివరి నిమిషంలో లాలిత్నగార్కు కేటాయించిన టికెట్ ను అవతార్సింగ్ లాగేసుకున్నారు. ఈ మార్పుపై పార్టీ కేడర్అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
గుర్గావ్: సిట్టింగ్ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్సింగ్ బీజేపీ తరఫున, అజయ్సింగ్కాంగ్రెస్తరఫున పోటీ చేస్తున్నారు.
హిస్సార్: జేజేపీ నుంచి బరిలోకి దిగిన దుష్యంత్చౌతాలా ముందంజలో దూసుకువెళుతున్నారు. కాంగ్రెస్ నుంచి భవ్య బిష్ణోయ్ పోటీ చేస్తున్నారు.
రోహ్ తక్: కాంగ్రెస్టికెట్ తో పోటీ చేస్తున్న దీపేందర్హుడా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు అంచనా.
అంబాలా: బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్సీనియర్నేత, మాజీ కేంద్ర మంత్రి కుమారి సెల్జా, బీజేపీ సిట్టింగ్ఎంపీ రతన్లాల్కటారియాను ఢీ కొంటున్నారు.
సోనిపట్: కాంగ్రెస్సీనియర్నేత భూపిందర్హుడా బీజేపీ సిట్టింగ్ఎంపీ సతీష్కౌశిక్తో తలపడుతున్నారు. బ్రాహ్మణులు కౌశిక్వైపు నిలిచినా భూపిందర్ కే విజయావకాశాలు ఎక్కువని వినిపిస్తోంది.
సిర్సా: పీసీసీ ప్రెసిడెంట్అశోక్తన్వర్, బీజేపీ నుంచి సునితా దగ్గల్, సిట్టింగ్ఎంపీ, ఐఎన్ఎల్డీ నేత చరణ్సింగ్రోరి ల మధ్య పోటీ ఉంది.
భివాణి–మహేంద్రగఢ్: బీజేపీ ఎంపీ ధరంబీర్, కాంగ్రెస్నేత శృతి చౌదరిల మధ్య పోరు హోరాహోరీగా సాగినా, నాన్జాట్కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ధరంబీర్ విజయాన్ని అందుకుంటారని అంచనాలు వినిపిస్తున్నాయి.
అంబాలా, కురుక్షేత్ర: ఈ రెండు చోట్లా బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీ హవాతో అధికారంలోకి..
2014 ఏడాదికంటే ముందు హర్యానాలో బీజేపీ ఉనికి నామమాత్రమే. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వాటా కేవలం నాలుగే. మోడీ హవాతో గత ఎన్నికల్లో అధికారం చేపట్టింది. పది లోక్సభ స్థానాల్లో ఏడింటిని గెల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు, కాంగ్రెస్పార్టీ 15 సీట్లు, ఐఎన్ఎల్డీ 12 సీట్లను, అకాలీ దళ్, బీఎస్పీ ఒక్కో సీటును, హర్యానా జనహిత్కాంగ్రెస్రెండు స్థానాలను, ఇండిపెండెంట్లు 5 సీట్లను గెల్చుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియ వెనక బీజేపీ సోషల్ ఇంజనీరింగ్స్ట్రాటజీ ఉందని రాజకీయ వర్గాలు
చెబుతున్నాయి.