మియాపూర్, వెలుగు: పనిచేసే ఇంటికి కన్నం వేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్పేట్లోని ఆదిత్య ఇంపీరియల్అపార్ట్మెంట్లో శ్వేత తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో మియాపూర్న్యూకాలనీకి చెందిన ఓ మహిళ పని మనిషిగా పనిచేస్తుంది.
ఫిబ్రవరి14న ఇంట్లో ఉన్న 60 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ. 4 వేల క్యాష్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసింది పని మనిషిగా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి 60 గ్రాముల బంగారు అభరణాలను రికవరీ చేశారు.
