
సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకు తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి కారు నడిపిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆమె చేసిన పనికి రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి తన కారుతో వెళ్లి డ్రైవింగ్ చేసింది.
ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక, ఈ వాహనం రైల్వే ట్రాక్పై ఉండటంతో ఆ మార్గంలో రావాల్సిన రైళ్లు ఆలస్యం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు – పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ యువతి గురించి మరో వాదన కూడా ప్రచారంలో ఉంది.
కారు నడిపిన యువతి లక్నోకు చెందిన రబికా సోనీ అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో రబికా ఐటీ ఉద్యోగం చేసేది. కొన్ని నెలల క్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ పరిణామంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమెకు కొంత కాలంగా మతి స్థిమితం లేదని వైద్యులు తెలిపారు. 108 వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి శంకర్ పల్లి పోలీసులు తరలించారు. పోలీసు నుంచి తప్పించుకోవడానికి యువతి ప్రయత్నించింది.