
కోల్కతా: జాబ్ ఇప్పిస్తానని మభ్య పెట్టి పన్నెండేళ్లుగా తనపై పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడంటూ పద్మశ్మీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013 జనవరిలో భారత్ సేవాశ్రమ్సంఘ్కు చెందిన ఆశ్రమ పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారని వివరించింది. పాఠశాల వసతి గృహంలో ఆశ్రయం కల్పించి ఈ దారుణానికి తెగబడ్డాడని తెలిపింది.
దీని ఫలితంగా తాను గర్భం దాల్చడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడని ఆరోపించింది. ఏళ్ల తరబడి తనపై అత్యాచారం చేసిన ప్రదీప్తానందపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరింది. కాగా, ఈ ఆరోపణలపై స్వామి ప్రదీప్తానంద స్పందిస్తూ.. ఇదంతా తనను బదనాం చేయడానికి జరుగుతున్న కుట్రేనని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని పేర్కొన్నారు.