హైదరాబాద్, వెలుగు: దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో మంగళవారం పీసీసీఎఫ్ డోబ్రియల్ అధ్యక్షతన అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, పరివేష్ 2.0 పోర్టల్ పై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, టీ– ఫైబర్, టెలికామ్ సంస్థల ప్రతినిధులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఇతర శాఖల ఆఫీసర్లకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, విధి విధానాలపై అవగాహన కల్పించారు. అటవీ అనుమతుల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సరైన అవగాహన లేకపోవడంతో వివిధ శాఖలు చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని అటవీశాఖ అధికారులు వివరించారు.
