తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్లో యాత్ర 2 (Yatra 2) మూవీ బెస్ట్ బయోపిక్ అని చెప్పొచ్చు .వైఎస్ రాజశేఖర్రెడ్డి (మమ్ముట్టి) మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి (జీవా) చేసిన ఓదార్పు యాత్రను కళ్ళకి కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్.
ఈ సినిమా ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్తో నడుస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబందించిన యాత్ర 2 మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జగన్ పాత్రలో నటించిన కోలీవుడ్ హీరో జీవా సెలెక్ట్ చేయడం నుంచి సినిమా కంప్లీట్ అయ్యే వరకు సినిమాలో ఉన్న ముఖ్యమైన సీన్స్ ని కట్ చేసి వీడియోలో చూపించారు.
జగన్ ఓదార్పు యాత్ర సమయంలో..ఆయనకు ఎదురైన అనుభవాలు..పేదలు పడే బాధలు..సమాజంలో జరిగే అన్యాయాలు..ఆయనని ప్రేరేపించిన సంఘటనలు నుంచి..ఏ విధంగా పాదయాత్ర మొదలు పెట్టాడనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. అంతేకాదు..జీవా చెప్పే డైలాగ్స్, మేనరిజమ్స్, బాడీలాంగ్వేజ్తో చాలా చోట్ల జగన్ను జీవా గుర్తుచేశాడు. జగన్ జీవితంలోని పాదయాత్ర సమయంలో కీలక ఘట్టాలను చాటిచెబుతూ వచ్చే డైలాగ్స్ థియేటర్లో అదిరిపోయాయి.