
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఓల్డ్ మూవీస్ నుంచి హిట్ మూవీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ.. న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలని రెబల్ స్టార్ ప్రభాస్ చూస్తున్నాడు. ‘ప్రభాస్’ హీరోగా నటించిన ‘బిల్లా’ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. స్టైలిష్ యాక్షన్ తో రూపొందిన ఈ మూవీని ఈ నెల 23న 4కె వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. అనుష్క హీరోయిన్ గా కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీని... గోపీకృష్ణ మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.
ఈ మూవీ ద్వారా వచ్చే డబ్బుని డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారి చికిత్స కోసం ఖర్చు చేస్తామని గోపికృష్ణ మూవీస్ ప్రతినిధులు ప్రకటించారు. దివంగత నటుడు కృష్ణంరాజు, యూకే డాక్టర్ల సహకారంతో యూకే ఇండియా డయాబెటిస్ ఫుడ్ ఫౌండేషన్ ఏర్పాటైందన్నారు. కృష్ణంరాజు లేకపోయినా... ఈ ఫౌండేషన్ ని తాము ముందుండి నడిపిస్తామని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, డిల్లీతో పాటు అబుదాబీ, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ‘బిల్లా’ ను రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఎన్ని థియేటర్స్ లలో అన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి నటుల సినిమాల రీ రిలీజ్ రికార్డ్స్ ని బిల్లా బద్దలు కొడుతుందని చిత్ర బృందం అంచనా వేస్తోంది.