పెళ్లి క్యాన్సిల్ కావడంతో యువతి సూసైడ్

పెళ్లి క్యాన్సిల్ కావడంతో యువతి సూసైడ్

తుంగతుర్తి, వెలుగు: కుదిరిన పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది . పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న, లక్ష్మీల పెద్ద కూతురు పావని(23)కి ఎంగేజ్ మెంట్ జరిగింది . అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు పావని తనతో కలిసి దిగిన ఫొటోలను పెళ్లి కుదిరిన అబ్బాయికి వాట్సాప్ లో పంపించాడు. దీంతో వివాహం క్యాన్సిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన పావని మంగళవారం తమ పొలానికి వెళ్లి.. అక్కడ ఉన్న వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి చనిపోయింది. ఆత్మహత్యకు కారకుడైన యువకుడిని శిక్షించాలని ప్రజా సంఘాల లీడర్లు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.